తాడేపల్లి: పుంగనూరు అల్లర్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. అంజూ యాదవ్ అనే సీఐ ఒక వీధి రౌడీ అల్లరి చేస్తే లెంపకాయ కొట్టారు.
- అదేదో తీవ్రమైన నేరమైనట్లు, పోలీసులు ప్రజల హక్కులను హరించివేస్తున్నారు అని ప్రచారం చేశారు.
- ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు టీడీపీ పేటీఎం బ్యాచ్ అంతా అల్లరి చేశారు.
- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతి వెళ్లి ఎస్సీకి ఫిర్యాదు చేశారు.
- మూడు రోజుల క్రితం చంద్రబాబు కర్త,కర్మ, క్రియగా వ్యవహరించి జరిగిన అమానుషంపై ఎందుకు వీళ్లు మాట్లాడటం లేదు..?
- అంగళ్లులో ఎలా వాళ్ల మనుషులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు.
- అక్కడి పోలీసులు పాటించిన సంయమనానికి సెల్యూట్ చేయాలి.
- ప్రాణాపాయం ఎవరికీ కలుగలేదు కానీ..చంద్రబాబు కుట్రలను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే మాస్ కిల్లింగ్స్ జరిగి ఉండేవి.
- 40 మంది పోలీసులు నెత్తురోడుతూ శాంతిభద్రతలను కాపాడారు.
- ఈ వార్త కనీసం రామోజీరావు, రాధాక్రిష్ణ, టీవీ5 నాయుడులు ఒక్క చోటైనా ప్రచురించారా..?
- ఎంత సేపు చంద్రబాబు దేవుడు, వీరుడు, శూరుడు అంటున్నారు.
- చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందంటూ రాయడం తప్ప సిగ్గు లజ్జ వారికి లేకుండా పోయింది.
- దీనికేనా మీరు మీడియా నడుపుతున్నది..? చంద్రబాబు కుట్ర చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.
- కార్లలో గన్ లతో, కత్తులతో, బీరుబాటిళ్లతో దాడి చేయడం అందరం చూశాం.
- పోలీసులు కాల్పులు జరిపించి మా మనుషులను ఈ ప్రభుత్వం చంపేస్తుందని సానుభూతి పొందాలని ప్లాన్ వేసుకుని వచ్చాడు.
- జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉంది కదా..ఎందుకు రూట్ మారింది..
- అలాంటి చంద్రబాబు కుట్రను పోలీసులు చక్కగా తిప్పికొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు.
- ఆయన సుపుత్రుడు టీడీపీ కార్యకర్తల దెబ్బ చూశారు కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు.
- చంద్రబాబు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నాడు. తండ్రీ కొడుకుల నాటకాలు మానేయండి...
- ఇంత మంది పోలీసులుపై దాడి జరిగితే నీదీ ఒక రాజకీయ పార్టీనే కదా..స్పందించవద్దా..?
- దీనిపై స్పందించాలన్నా ప్యాకేజీ కావాలా పవన్ కల్యాణ్..?
- ఈ మాత్రం దానికి నీకు ఎందుకు నీకు రాజకీయ పార్టీలు..వారాహి డ్రామాలు.
- చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ కోసం పుష్కరాల్లో పదుల సంఖ్యలో ప్రజల్ని చంపేశాడు.
- మొన్నటికి మొన్న ఇదేం ఖర్మ అనుకుంటూ ఎంత మందిని చంపాడో చూశాం.
- ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయ్..రాష్ట్రం రావణ కాష్టం కావాలని ప్రయత్నం చేస్తున్నాడు.
- ప్రజలంతా ఇతని అధికార దాహాన్ని, రక్త దాహాన్ని గమనించండి.
రిషాంత్ రెడ్డికి, నీకు పోలికేంటి లోకేశ్..?
- ఎర్రడైరీలో మొదటి పేరు రిషాంత్ రెడ్డి అని లోకేశ్ అంటాడు.
- దొడ్డిదారిలో మంత్రివైన నీకు..ఐఐటీలో చదివి, మంచి ర్యాంకుతో ఐపీఎస్ అయిన అతనికి నీకు పోలిక ఎక్కడ..?
- మీ నాన్న డబ్బులు పెట్టి చదివిస్తే నువ్వు స్టాన్ ఫోర్డ్ వెళ్లి చదివావు తప్ప నీ టాలెంట్ వల్ల కాదు.
- నీ బాడీ లాంగ్వేజ్ కి నీ డైలాగ్ లకు అసలు ఏమైనా సంబంధం ఉందా..?
- ముందు నువ్వు గెలుస్తావా లేదా అనేది చూసుకో.
- లోకేశ్, చంద్రబాబులు ఇద్దరూ ఒళ్లు కొవ్వొక్కి వాడు వీడు అంటూ మాట్లాడుతున్నారు.
- వీరిద్దరిపై హత్యాయత్నం కేసులు పెట్టాలి.
- చేతకాని వాడే హింసను ప్రేరేపిస్తాడు...సానుభూతి డ్రామా ఆడతారు.
- చంద్రబాబుకు, ఆయన పుత్రుడికి, దత్తపుత్రుడికి గెలవలేం అని అందర్నీ రెచ్చగొడుతున్నారు.
- వీరికి ఎల్లో మీడియా వాళ్ల మనిషి కుర్చీలో లేడని ఇష్టారీతిన రాతలు రాస్తున్నారు.
- 23 సీట్లిచ్చి మూలన కూర్చోబెడితే వారికి ఇంకా బుద్ధిరాలేదు. మరింత బలంగా బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉంది.
- మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు ప్రాజెక్టులతో సస్యశ్యామలం ఎందుకు చేయలేకపోయావ్..?
- రాజశేఖరరెడ్డి అనే వ్యక్తే ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈ రాష్ట్ర రైతుల పరిస్థితి ఏంటి..?
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నేనే కట్టాను అంటాడు..ఎక్కడుందో చూపించు..జీవో ఇస్తే ప్రాజెక్టు పూర్తయినట్లేనా..?
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎక్కడ, ఎప్పుడు, ఎలా కట్టావ్...చూపించు.
- చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది లాంటి వాడు.
- సంఘ విద్రోహశక్తి...ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రజలకు మనవి.