నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

పంచాయతీ,గ్రామీణ,గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని  పంచాయతీ,గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో ప్రత్యేక  పూజలు నిర్వహించారు. గురువారం ఆయన సచివాలయంలో తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో  మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.

Back to Top