కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నాడు నారా లోకేష్కు తప్ప ఎవరికైనా జాబ్ వచ్చిందా?
15 Sep 2022 4:05 PM
మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో నారా లోకేష్ నాయుడికి తప్ప ఎవరికైనా జాబ్ వచ్చిందా? అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. లోకేష్కు జాబ్ వస్తే రాష్ట్రంలో అందరికీ జాబ్ వచ్చినట్లేనా? అంటూ నిలదీశారు. గురువారం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు. ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం రోజునే టీడీపీ డ్రామా మొదలైందని.. వారికి ఏ మాత్రం సిగ్గులేదని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. 'ఈ రాష్ట్రంలో జాబు రావాలంటే వైయస్ జగన్ మోహన్రెడ్డి ఉండకూడదా?. గతంలో బాబు వస్తే జాబు అన్నారు.
రాష్ట్రంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్ది అని అన్నారు. వైద్యరంగానికి సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. వైయస్ జగన్ దిగిపోతేనే ఉద్యోగాలొస్తాయనడానికి టీడీపీకి సిగ్గులేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మీ దురహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
'మళ్లీ బాబు వస్తే లోకేష్కు ఉద్యోగం కట్టబెట్టాలన్నదే మీ ఆలోచన. మెడికల్ వ్యవస్థలో పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది. టీడీపీకి రాజకీయంగా నూకలు చెల్లిపోయాయి. మీ డ్రామాలు ఎవరూ నమ్మరు' అని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.