కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలు
19 May 2021 6:28 PM
మంత్రి కొడాలి నాని
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరిస్తామని మంత్రి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం నమూనాలు పరిశీలించి.. రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని.. ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు.