పారిశ్రామికంగా ఏపీని ముందుంచుతాం

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

తిరుపతి:  పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముందుంచుతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. తిరుపతిలోని సన్నీ ఆప్కో టెక్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాంది పలికారు. కొన్ని కంపెనీల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఈ రోజు జరిగాయి. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. పారిశ్రామికరంగంలో ప్రంపంచలోనే ఏపీని ముందు స్థానంలో òఉంచేందుకు ముఖ్యమంత్రి  కృషి చేస్తున్నారు. కంపెనీలకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనలకు అనుగణంగా పని చేస్తామని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. 

 

తాజా వీడియోలు

Back to Top