కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పారిశ్రామికంగా ఏపీని ముందుంచుతాం
23 Jun 2022 4:06 PM
మంత్రి గుడివాడ అమర్నాథ్
తిరుపతి: పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుంచుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తిరుపతిలోని సన్నీ ఆప్కో టెక్ ప్రైవేట్ లిమిటేడ్ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు, 20 వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారు. కొన్ని కంపెనీల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఈ రోజు జరిగాయి. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. పారిశ్రామికరంగంలో ప్రంపంచలోనే ఏపీని ముందు స్థానంలో òఉంచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. కంపెనీలకు ఏ రకమైన సహకారం కావాలన్నా అందిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగణంగా పని చేస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు.