విశాఖ: ఉగాది తర్వాత సెలబ్రిటీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరిస్థితి క్లోజ్.. ఈ ఆరు నెలలు మాత్రమే అరుపులు, కేకలు ఉంటాయంటూ మంత్రి బొత్స సత్యానారాయణ ఎద్దేవా చేశారు. రామోజీలా దోచుకుతినడం, పేదవారి రక్తం తాగే అలవాటు తనకు లేదని మండిపడ్డారు. గ్రోత్ సెంటర్ భూములపై రామోజీకి మంత్రి బొత్స సవాల్ విసిరారు. విశాఖలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీల మీద భూమి ఇస్తుందన్నారు. గ్రోత్ సెంటర్ ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. కావాలంటే మాకు ఇచ్చిన భూములు అదే రేటుకు రామోజీకి ఇస్తాం.రామోజీ అక్కడే పరిశ్రమ స్థాపించాలి. గ్రోత్ సెంటర్ భూములకు 2018లో జీవో ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తారు అంటూ మంత్రి బొత్స మండిపడ్డారు.
సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి సీఎం కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదన్నారు. ముగ్గురు ముడు దిక్కులు తిరిగి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని.. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు సహనం కోల్పోతున్నారంటూ మంత్రి ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టింది చంద్రబాబే.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి. హోదాను మేము తాకట్టు పెట్టలేదు.. మీలాగా స్వీట్స్ పంచుకోలేదు. రైతుల ఆత్మహత్యలు మీ హయాంలో జరగలేదా చంద్రబాబు. ఎదుట వారు ఏమనుకుంటారనే సిగ్గు కూడా చంద్రబాబుకు లేదు. చంద్రబాబు పాలన ఏమీ బాగుందో పవన్ చెప్పాలి. పచ్చకామెర్లు వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంటూ మంత్రి బొత్స దుయ్యబట్టారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక సెలబ్రిటీ రాష్ట్రం అంతా తిరుగుతూ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారు.. 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని విమర్శించిన ఆయన.. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే జరగలేదా..? చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అని సూచించారు బొత్స.. సెల్ ఫోన్ నేను కనిపెట్టానని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడడం లేదా? అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ లెక్కల్లో మనిషే కాదన్న బొత్స.. సెలబ్రిటీ (పవన్ కల్యాణ్)కి టీడీపీ పాలన నచ్చడం అంటే పచ్చకామెర్ల వాళ్ళకు లోకం పచ్చగా కనిపించినట్టే అని సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో దోపిడీ.. పెత్తందారి వ్యవస్థ కనిపించలేదా.. ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని ఏడాది క్రితమే చెప్పానని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు జరిగితే నీకేంటి నొప్పి.. అని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రజలు నిన్ను హర్షించడం లేదన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని దించేస్తానంటున్నారు.. అది ఎందుకో.. దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో సెలబ్రిటీ చెప్పాలని డిమాండ్ చేశారు.
సంక్షేమం వైయస్ఆర్ పేటెంట్.. దాని మీద వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి బొత్స.. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల ఇండస్త్రీకి 4 ఏళ్ల పాలనకి తేడా సున్నా మాత్రమే.. మేం చేసిన మంచి పనులు 100 చెప్పగలుగుతాం.. మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రాజధానిలో 30 వేల కోట్ల భూములు కొనేశారని మాట్లాడడానికి అది నాలుకా, తాటిమట్టా అంటు ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎంత..? స్కూటర్ మీద వెళ్లిన బొత్స ఆస్తులు విలువ ఎంత..?.. నక్కకి.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..! అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.