విశాఖపట్నం: టీడీపీ కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా? అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వారి చర్యలతో పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..: నీచంగా కూటమి ఆలోచన: – ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసిన కూటమి ఆలోచనలు ఎంతో నీచంగా, దుర్మార్గంగా, మానవత్వం లేకుండా ఉన్నాయి. – వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని, ఈసీ ద్వారా అడ్డుకున్న వారు.. తమ దుర్మార్గ చర్యల వల్ల.. గత నెల, ఈనెల 40 మంది వరకూ పొట్టన పెట్టుకున్నారు. – ఇంత మానవత్వం లేకుండా కూటమి ఎందుకు ఆలోచిస్తోంది? వాళ్ల ఆలోచనలు చాలా కఠోరంగా ఉన్నాయి. – వైఎస్సార్ ఆసరా పథకంలో సుమారు 79 లక్షల మంది లబ్ధిదారులున్నారు. పథకంలో చివరి విడతలో ఇంకా, సుమారు రూ.1839 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద డబ్బున్నా విడుదల చేయవద్దని టీడీపీ, వారి కూటమి ఫిర్యాదులు చేసి ఆపించేశారు. – గత నెల 24న, ఆ చెల్లింపులు చేయాల్సి ఉండగా, దానిపై పలు దఫాలుగా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అనుమతి కోరినా, ఈసీ ఒప్పుకోలేదు. – ఇదొక్కటే కాదు.. విద్యాదీవెన కూడా అలానే చేశారు. 28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.703 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. – నిజానికి, ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్లే. అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరినా, అమలుకు అంగీకరించలేదు. – విద్యాదీవెన కోసం ఒకవైపు విద్యార్థులు ఎదురు చూస్తుండగా, మరోవైపు యాజమాన్యాలు కూడా నిధుల కోసం మమ్మల్ని సంప్రదించాయి. – అసలు ఈ పథకాలకు, ఎన్నికలకు ఏం సంబంధం?. విద్యాదీవెనకు, ఎన్నికలకు ఏం సంబంధం? ఇవన్నీ సాధారణంగా జరగాల్సిన కార్యక్రమాలు. – దీనికి కూటమి ఇంత నీచంగా ఫిర్యాదులు చేయడం, ఎన్నికల కమిషన్ దాన్ని ఆపడం జరిగింది. – ఇంకా తుఫానులు, కరవు పరిస్థితులు వచ్చినప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆగిపోయింది. – గత ప్రభుత్వాల్లా కాకుండా ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో నష్టపరిహారం ఇవ్వాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. – గత ప్రభుత్వాలైతే నష్టం జరిగిన రెండేళ్లకు కానీ ఇచ్చేవి కావు. – ఇటీవల వచ్చిన తుఫాను, కరవు వల్ల 13.60లక్షల మందికి రూ.1294 కోట్లు ఇవ్వాల్సి ఉంది. – బ్యాంకుల్లో డబ్బు ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని చెప్పినా వినిపించుకోలేదు. – మరి రైతులు ఆర్థికంగా నిలదొక్కకుంటారు. ఇది కూటమి కర్కశమైన ఆలోచన. – వైఎస్సార్ చేయూత కూడా మూడు విడుతలు ఇచ్చాం. నాలుగో విడుత బటన్ నొక్కారు. – లబ్ధిదారులు 33 లక్షల మందికి ఆ నిధులు విడుదల చేస్తామంటే, దానికీ ఒప్పుకోలేదు. రూ.565 కోట్లు ఇవ్వాల్సి ఉంది. – ఈబీసీ నేస్తం కింద 4.20లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉంది. – అసలు ఈ కూటమి ఏమనుకుంటోంది? పేదవాడు బతకొద్దా? – ఎన్నికలు వచ్చాయని సామాన్యుడి రోజు వారీ కార్యక్రమాలు జరగొద్దా? – ఎన్నికలు వచ్చిన మూడు నెలలు వాళ్లు గౌరవంగా బతకనక్కర్లేదా? – ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎప్పుడైనా జరిగిందా? ఆరోజు మేము అడ్డుకోలేదే?. – 2019లో పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారు. – మేం ఆరోజు ఏమైనా అడ్డుపెట్టామా? ఇవ్వకూడదని మేమేమన్నా ఫిర్యాదులు చేశామా? – మీకు ఇలాంటి బుద్ధులేంటి? – దయచేసి రాష్ట్రంలో ఉన్న మహిళలు, రైతులు, విద్యార్థులను వారి చేష్టలు చూడమని కోరుతున్నాం. – ఈ కూటమి నీచమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, వారి కర్కశమైన, మానవత్వం లేని ఆలోచనలు గమనించాలి. – ఏది ఏమైనా ఎన్నికలైన మరుక్షణమే బ్యాంకుల్లో ఉన్న డబ్బును విడుదల చేస్తాం. – ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కూటమికి ప్రజలు బుద్దిచెప్పాలని కోరుతున్నా. చంద్రబాబు మాటలు సభ్యసమాజం హర్షించేవేనా?: – చంద్రబాబు అండ్ కో సహనం కోల్పోయారు. అసహనం ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటి కుయుక్తులను పాల్పడుతున్నారు. – ఓవైపు వృద్ధుల్ని హింసిస్తున్నారు.. మరో వైపు మహిళలకు గౌరవంగా అందుతున్న లబ్ధిని అడ్డుకుంటున్నారు. – విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేస్తున్నారు. – ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో ఉన్న మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈబీసీ నేస్తానికి మోకాలడ్డుతున్నారు. – ఎన్నికలు ఉన్న ఈ మూడు నెలలు వారు గాలికి బతకాలా? – ఏరకంగా వారు వాళ్ల గౌరవాన్ని కాపాడుకుంటారు? – దీనికి తోడు జగన్మోహన్రెడ్డి గారిపై సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. – 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ సభ్యసమాజంలో ఒక ముఖ్యమంత్రిని అలాంటి మాటలు మాట్లాడవచ్చా? – ఎవరికైనా తల్లి తల్లే కదా? ఆ భాష ఏంటి? – నీ అమ్మ మొగుడు, నీ బాబు అంటూ వాడుతున్న పదజాలాన్ని సభ్యసమాజం హర్షిస్తుందా? – ఆ మాటలు మాకు ఎవరికీ రావనుకున్నారా? మాకు సభ్యత సంస్కారం ఉంది. – చంద్రబాబు..నువ్వు అలాంటి మాటలతో ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నావు? – ఛీ..ఛీ.. అతని పేరెత్తడానికే చాలా అసహ్యంగా ఉంది. జరగాల్సిన మేలుకు మోకాలడ్డి.. చావులకు కారణం అవుతున్నాడు: – ఒక పక్క జరుగుతున్న మేలుకు మోకాలడ్డి వాళ్ల చావులకు కారణం అవుతున్నాడు చంద్రబాబు. – మరో పక్క ప్రజలకు అందుతున్న లబ్ధిని ఎన్నికల పేరు చెప్పి అడ్డుకుంటున్నావు. – కూటమి ఫిర్యాదు చేస్తే తానా అంటే తందాన అన్నట్లు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది. – ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి మేము వ్యతిరేకం కాదు. కానీ వాస్తవాలను పరిశీలించాలి. – అంతే కానీ.. వాళ్లు ఫిర్యాదు ఇస్తే.. దాని వల్ల సమజానికి, వ్యక్తులకు, వ్యవస్థను నష్టమా అనేది ఆలోచించకుండా వాళ్ల చావులకు కారణం అవ్వడం భావ్యమా? – చంద్రబాబు అటువంటి భాష మాట్లాడినప్పుడు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంది? – వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? – ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు నష్టపోతే ఎవరిది బాధ్యత? – విద్యార్థులకు ఫీజులు అందక వాళ్లను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత? – గౌరవంగా మహిళలు బతకాలని ఇస్తున్న చేయూత కార్యక్రమాన్ని ఆపడానికి ఎవరిది బాధ్యత? – వీటన్నిటి కూటమి బాధ్యత కాదా? ఎన్నికల కమిషన్ బాధ్యత కాదా? – గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేస్తే మాత్రం వీళ్లు ఓకే అంటున్నారు. – అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు సజావుగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. కొంచెం ఓపిక పట్టండి: – కొద్దిగా ఓపికపట్టండి. మీ గర్వం మీరు కాపాడుకోండి. ఈ పదిహేను రోజులు వెళ్లిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. – అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్టం, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. – దీనిపై కొన్ని సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. అవసరమైతే ప్రభుత్వం కూడా వెళ్తుంది. కూటమి గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయ్..?: – మొన్నామధ్య ఆ సెలబ్రిటీ నాయకుడు ముఖ్యమంత్రిగారిపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. – నిన్న సాక్షాత్తు చంద్రబాబునాయుడే ఆ భాష మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలి? – రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సబబేనా? ఆ భాష ఎదుటి వారికి రాదా? – మా పార్టీ నాయకత్వానికి సభ్యత, సంస్కారం ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు మాకు నేర్పిన సభ్యత వల్ల మాట్లాడటం లేదు. – మోడీ గారు చెప్పినా..ఇంకెవరు చెప్పినా..కూటమి గెలిచే అవకాశాలు ఎక్కడున్నాయి? అది ధర్మం కాదు: – ఈసీని తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడించడం ధర్మం కాదు. – మోడీ ఎవరో చెప్పింది మాట్లాడతారు. నేను స్థానికంగా ఉన్నవాడ్ని. వాస్తవాలు ఏంటో మాట్లాడతాను. – ముగ్గురూ తోడు దొంగలే. ఒక దొంగ మరొక దొంగకు సహకరించుకుంటున్నారు. – ల్యాండ్ టైటిలింగ్యాక్ట్పై బీజేపీ సోదరులే మంచి కార్యక్రమమని చెప్తున్నారు. – విస్తృతంగా చర్చించి, చట్టాన్ని రూపొందించాలని కేంద్రమే చెప్తోంది. – సామాన్య ప్రజలకు కాపాడటానికి ఇది బ్రహ్మాస్త్రం అని న్యాయవాదులు కూడా చెప్తున్నారు. – స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్, ప్రజల అవసరాలు వారికి అక్కర్లేదు. – ఈ తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేసి వెళ్తారు..అంతే! – వీళ్లా మా గురించి మాట్లాడేది? ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా? – ఆయన అదే నోటితో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడని చెప్పాడుగా? – ఇప్పుడు మర్చిపోయాడా? ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటమేనా? – వాస్తవాలు, నిజాలు అవసరం లేదా? ఆ పదవికి విలువ తీసేస్తున్నారు. – ప్రధాన మంత్రి మాటలంటే దానికి ఒక పవిత్రత ఉండాలి. – ఈ దేశంలో ఎంతో మంది ప్రధానిమంత్రులుగా చేశారు. ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. పోలవరంలో అవినీతి జరిగిందంటే, విచారణ చేయించుకోవచ్చుగా?: – పోలవరానికి ప్రధానమంత్రి.. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే నిధులు విడుదల చేశారా? – అందులో అవినీతి జరిగింది అనే అనుమానం వస్తే తన టీంను పంపి విచారణ చేయించవచ్చు కదా? – ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అంత వేక్గా మాట్లాడకూడదు కదా? – లేదు వాళ్లు వచ్చి విచారణ చేసి నిజంగా ఏదన్నా జరిగిందని చెప్తే అప్పుడు మేం సమాధానం చెప్పుకోవాలి. – అది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా అవుతుంది. – చంద్రబాబు హయాంలో పునరావాసానికి ఇవ్వాల్సిన సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారు. – అప్పట్లో చూపిన లబ్ధిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. – మరి నిర్వాసితులకు ఎవరు డబ్బు ఇస్తారు? ఆ బాధ్యత కేంద్రానిదే. – చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం మనందరికీ తెలుసు. – ఆయన తప్పులను కూడా సరిచేసే కార్యక్రమం చేస్తున్నాం. చట్టమే లేదు. మరి బాధితుడు ఎలా అయ్యాడు?: – యాక్ట్ లేకుండా పీవీ రమేష్ బాధితుడు ఎలా అవుతాడు? – ఆయనకు, నాకు డిబేట్ పెట్టండి.. వాస్తవాలేంటో ప్రజలకు తెలుస్తాయి. – ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా చేశాడు కాబట్టి ఆవతలి వాడిపై జులుం చేసి కొట్టేయాలని చూస్తున్నాడేమో..ఎవరికి తెలుసు? – ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి పథకాల లబ్ధిని ఆపే దౌర్భాగ్యపు పనులు చేశారు?. అని మంత్రి శ్రీ బొత్స ఆక్షేపించారు.