రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
అమలాపురం కుట్ర వెనుక చంద్రబాబు, పవన్
25 May 2022 2:25 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు
పోలీసులు సంయమనంతో ప్రాణనష్టం తప్పింది
విజయవాడ: అమలాపురం కుట్ర వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అమలాపురం ఘటన దురదృష్టకరమని మంత్రి ఖండించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి పరిణామాలు మంచిది కాదని హితవు పలికారు. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు.
పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని, అమలాపురం ఘటన వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు అన్నారు. అంబేద్కర్ ఒక కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని సూచించారు. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలన్న నేతలు ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని పవన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సంయమనంతో ప్రాణనష్టం లేకుండా నివారించారని తెలిపారు.