విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
బాబు, పవన్లకు మంత్రి అవంతి ఓపెన్ చాలెంజ్
31 Oct 2019 4:52 PM
వైయస్ఆర్ సీపీ నేతలు ఇసుక దాచుకున్నా.. దోచుకున్నా..
నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
వైయస్ కుటుంబానిది అన్నం పెట్టే చెయ్యి
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో వైయస్ఆర్ సీపీ నాయకులు ఇసుక దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, నిరూపిస్తే వారిని సస్పెండ్ చేయిస్తా.. చేయలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, పవన్, లోకేష్లకు ఓపెన్ చాలెంజ్ విసిరారు. నిరూపించలేకపోతే.. చంద్రబాబు, పవన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు. విశాఖలోని గ్రీన్ పార్కు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇసుక పోరాటం అని చంద్రబాబు, పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, వారి మాటలు వింటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గత ఐదేళ్లు భీమిలి నియోజకవర్గంలో ఎన్ని లక్షల టన్నుల ఇసుక తొవ్వారో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు.
వైయస్ కుటుంబానిది అన్నం పెట్టే చెయ్యి అని మంత్రి అవంతి అన్నారు. ప్రజాధనం కాపాడాలని సీఎం వైయస్ జగన్ చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నచ్చడం లేదని, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. పది సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు తీసుకోగానే.. వరుణదేవుడు కరుణించాడని, కృష్ణానదికి ఏడు సార్లు, గోదావరికి ఐదు సార్లు వరదలు వచ్చాయన్నారు. ఐదు సంవత్సరాల్లో అమలు చేయాల్సిన మేనిఫెస్టోలోని అంశాలను ఐదు నెలల్లో సీఎం వైయస్ జగన్ అమలు చేస్తుంటే చంద్రబాబుకు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే సీఎం వైయస్ జగన్పై చంద్రబాబు, ఆయన తాబేదారులు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.
ప్రభుత్వంపై, సీఎంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు వయస్సు తగ్గ మాటలు మాట్లాడాలని సూచించారు. ఐదు నెలల పాలన కూడా కాకముందే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని, ఈ రాష్ట్రం ఏమైనా నీ జాగీరా చంద్రబాబూ అని ప్రశ్నించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశాడన్నారు. ఈసారి వైయస్ జగన్కు ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు.
Read Also: చంద్రబాబు దత్త పుత్రుడు పవన్