రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
27న మహిళా కమిషన్ ఎదుట హాజరవ్వాల్సిందే..
26 Apr 2022 12:38 PM
అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం
కాలకేయుల ముఠా నాయకుడు చంద్రబాబు
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
విజయవాడ: మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఇచ్చిన సమన్లపై టీడీపీ నేత బోండా ఉమా నోటికొచ్చినట్టు మాట్లాడటంపై కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమ రాజకీయ నాయకుడి వేషంలో ఉన్న కాలకేయుడని అన్నారు. బోండా ఉమా లాంటి కాలకేయులకు చంద్రబాబు నాయకుడని ధ్వజమెత్తారు. విజయవాడలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటనపై టీడీపీ చిల్లర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కమిషన్కు వివరణ ఇచ్చే ధైర్యం చం ద్రబాబు, బోండా ఉమకు లేదని దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు.
ఈ నెల 27న చంద్రబాబు, ఉమ వచ్చి కమిషన్కు వివరణ ఇవ్వాల్సిందేనని.. లేకుంటే తమ పద్ధతులు తమకుంటాయని హెచ్చరించారు. చైర్పర్సన్గా తన పదవి పోయే వరకు పోరాడతానని చెబుతున్న చిల్లర రౌడీ బోండా ఉమకు చంద్రబాబు చీరకట్టి పంపాడా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇష్టానుసారం మాట్లాడితే బోండా ఉమ చెప్పు దెబ్బలు తినడం ఖాయమని హెచ్చరించారు.