శ్రీ‌ శార‌దాపీఠం వార్షికోత్సవాల‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని విశాఖ శ్రీ శార‌దాపీఠం ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర స‌రస్వ‌తి స్వామీజీ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న శ్రీ శార‌దాపీఠం వార్షికోత్స‌వాల‌కు రావాల్సిందిగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేశారు. అనంత‌రం ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అంద‌జేశారు. 

Back to Top