మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
దళితులను గౌరవించే ప్రభుత్వం మాది
28 Sep 2020 10:13 AM
మంత్రి ఆదిమూలపు సురేష్
ఘనంగా జాషువా జయంతి వేడుకలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను గౌరవిస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జాషువా విగ్రహానికి పూలమాల వేసి మంత్రి ఆదిమూలపు సురేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గుంటూరులో గుర్రం జాషువా కళాప్రాంగణం ఏర్పాటుకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమాజ హితం కోసం జాషువా ఎన్నో రచనలు చేశారని గుర్తుచేశారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రి తిప్పికొట్టారు. గత 14 ఏళ్లలో చంద్రబాబు ఎలా దాడులు చేశారో అందరికీ తెలుసునన్నారు. దళిత సమాజికి వర్గానికి పెద్దపీట వేస్తూ సుచరితకు హోం మంత్రి పదవి ఇచ్చిన ప్రభుత్వం తమదని, దళితుల అభ్యున్నతికి, సమనత్వానికి వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. నవ సమాజంలో అణగారిన వర్గాలు ఏ విధంగా చైతన్యం కావాలో తెలిపిన వ్యక్తి జాషువా అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుకే పరిమితం కాకూడదని సీఎం జగన్ పోరాడుతున్నారని తెలిపారు. దళితులపై దాడులు అంటూ ప్రతిపక్షాలు కొత్త రాజకీయం తెర మీదకు తెస్తున్నారని, వారి కుల రాజకీయాలు చెల్లవని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మెరుగు నాగార్జున, సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.