టీడీపీని నడిపేది ఆ రెండు పత్రికలు, టీవీలే

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సుప్రీం కోర్టు తీర్పు విషయంలో ఆ పత్రికల కథనాలు చూస్తే అర్థమవుతోంది

రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, రైతులకు న్యాయం చేస్తాం

రాజధాని విషయంలో లేని కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చింది

అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసేందుకే వికేంద్రీకరణ నిర్ణయం

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నేతలు మౌనం వహించారు

వికేంద్రీకరణఫై మరింత పకడ్బందీగా చట్టం తీసుకువస్తాం

మా నాయకుడు వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు తేలాలి

హత్యకు ఎవరు బాధ్యులో దొరకాలి.. వారికి కఠినమైన శిక్షపడాలని కోరుకుంటున్నాం

తాడేపల్లి: తెలుగుదేశం అనబడే ఒక రాజకీయ పార్టీని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీలు నడుపుతున్నట్టుగా వారి బ్యానర్‌ స్టోరీలు చూస్తేనే అర్థం అవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్నటి రోజున సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎక్కడా స్పందించలేదని, కానీ ఎల్లో మీడియా మాత్రం ఎగబడి మరీ శీర్షికలు ప్రచురించిందన్నారు. రాజధానిపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా ఎవరికీ అభ్యంతరం లేని పకడ్బందీ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌ ఆవరణలోని మీడియా పాయింట్‌ వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..
శాసనసభలో సుదీర్ఘమైన చర్చ తరువాత వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ప్రత్యర్థులు ఎవరైనా సాంకేతిక పరమైన ఇబ్బందులు, లీగల్‌ సమస్యలు లేవెత్తకుండా, ఎవ్వరికీ అభ్యంతరం లేకుండా మరింత పకడ్బందీగా చట్టాన్ని తీసుకువస్తామనే ఆ బిల్లును వెనక్కు తీసుకుంటున్నామని చెప్పాం. 

బిల్లు వెనక్కు తీసుకున్న తరువాత కూడా లేని కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి సుప్రీం కోర్టు డైరెక్షన్స్‌ ఇచ్చింది. రాజధాని విషయంలో హైకోర్టు టైమ్‌ లిమిట్‌ పెట్టడం వంటి కొన్ని ఇబ్బందికర అంశాలున్నాయి. రాజధానిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. 

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ప్రధానమైన శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది. మిగిలిన ఇనిస్టిట్యూషన్స్‌ అక్కడ వస్తాయి. మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత జరిగే అభివృద్ధితో రైతులు కూడా లబ్ధి పొందుతారు. ఏ ప్రభుత్వమైన రైతులకు న్యాయం చేయకతప్పదు. ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తుల మధ్య సమస్య కాదిది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, చట్టబద్ధమైన పాలన, రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేసే ప్రభుత్వం మాది. ఇష్టం వచ్చినట్టుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. రైతుల దగ్గర భూమి సేకరించడంలో తప్పులు ఘోరంగా జరిగాయి. ఆ రోజు చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ భ్రమ కల్పించారు. 40 ఏళ్లు పట్టే అభివృద్ధిని మూడు, నాలుగేళ్లలో చూపిస్తామని, ఫక్తు స్టాక్‌ మార్కెట్‌లో ధరలు ఎక్కువ చూపించి షేర్లు అమ్ముకొని బయటపడేలా ఆరోజున టీడీపీ చేసింది. 

పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం.. వారి ఆస్తి తీసుకున్న తరువాత దానికి సంబంధించిన డెవలప్‌మెంట్, ధర పెరిగేట్టు, ఇన్‌కం లెవల్‌ పెరిగే ప్రయత్నం చేయడంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఇంకా ముందుంటుంది. అమరావతిగా పిలుస్తున్న 29 గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ కమిట్‌మెంట్‌ ఉందో.. అభివృద్ధి చేసిన స్థలాలు, మౌలిక సదుపాయాలు, ఏకో సిస్టమ్, ట్రస్ట్‌ ఏరియా కింద కొన్ని ప్రాజెక్టు కూడా రావొచ్చు. ఇందులో రైతుల ప్రయోజనాలు, ఇన్నాళ్లు పెట్టుబడిన పెట్టిన వృథా కాకుండా చూసే ప్రయత్నం ఉంటుంది. 

హైకోర్టు నాలుగు అడుగులు ముందుకేసింది, రాజ్యాంగబద్ధమైన ఒక ప్రభుత్వం చేయగలిగిన పనిలో అనవసరంగా వేలు పెడుతుందనే కామెంట్‌ సుప్రీం కోర్టు చేసింది వాస్తవం. 

నిన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై టీడీపీ ఎక్కడా మాట్లాడలేదు. ఎల్లో మీడియా మాత్రం ఎగబడి ప్రచారం చేసింది. టీడీపీని నడిపేది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీలే అన్నట్టుగా ఉంది. వారి పేపర్లలో బ్యానర్లు చూస్తే సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు తెలుగురాదు కాబట్టి ఏమీ అర్థం కాకపోవచ్చు. ఎల్లో మీడియా ఎందుకు చొక్కాలు చించుకుంటుందో అర్థం కావడం లేదు. ఎల్లో మీడియాకు సంబంధించి స్టే ఇవ్వని కేసు అన్నట్టుగా రాశారు. మిగిలిన పత్రికలన్నీ ఏ అంశం మీద స్టే ఇచ్చారో దాన్ని ప్రజెంట్‌ చేశారు. ఈ రెండు పత్రికల్లో మాత్రమే, వారి కలర్, కడుపుమంట, వికృతమైన ఆనందం వారి బ్యానర్‌లో కనిపిస్తుంది. హైకోర్టు తీర్పు దేనిమీద అయితే ఇచ్చిందో.. ఆ తీర్పుపైనే విచారణ జరపాల్సి ఉంటే.. దానిపై స్టే ఎలా ఇస్తారు.. స్టే ఇవ్వనంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటీ..? హైకోర్టు ఇచ్చిన కామెంట్స్‌ మీద ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళితే.. దాని మీద విచారణ జరపాలి కాబట్టి స్టే ఇవ్వడం లేదని చెబితే.. దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై స్టే ఇస్తే వాటిని పక్కకు తోసేశారు. 

సుప్రీం కోర్టు తీర్పుపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. టీడీపీని ఎవరు మాట్లాడుతున్నారనేది ఇక్కడే తెలిసిపోతుంది. రాజకీయ అజెండాతో పొలిటికల్‌ పార్టీ నడవాలి కానీ, మీడియా సంస్థలు నడుపుతున్నట్టు వారి బ్యానర్‌ ఐటమ్స్‌చూస్తే అర్థం అవుతుంది. రెండు మీడియా సంస్థలే తెలుగుదేశం అనబడే రాజకీయ పార్టీని నడుపుతున్నట్టుగా అర్థం అవుతుంది. 

సుప్రీం కోర్టు విచారణ గమనించిన వారికి నేటికీ రాజధాని అమరావతి అని క్లియర్‌గా అర్థం అవుతుంది. సమగ్రమైన విధానాలతో మరింత పకడ్బందీగా ఎవ్వరికీ అభ్యంతరం లేని చట్టం తీసుకువస్తామనే చెబుతున్నాం. మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు,  అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే ఉద్దేశంతో మూడు రాజధానుల పేరిట వికేంద్రీకరణ చర్యలు చేపడుతున్నామో.. చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియకు లోబడి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఏరకంగా చేయాలో అది పూర్తి చేస్తుంది. 

హైకోర్టులో అభ్యంతరం రాకపోయి ఉంటే మూడు రాజధానుల అంశం ఇప్పటికే అయిపోయేది. జనవరి 31కు వాయిదా ఉంది. స్పష్టమైన అభిప్రాయంతో ప్రజల ఆకాంక్షల మేరకు వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. 

అమరావతిని రాజధానిగా చేయాలని పార్లమెంట్‌ చట్టంలో ఎక్కడా లేదు. నిజంగా పార్లమెంట్‌లో చట్టం ప్రకారం చేసి ఉంటే శివరామకృష్ణన్‌ కమిటీ అమరావతిలో రాజధాని వద్దు అని చెప్పింది. చంద్రబాబు పెట్టిన నారాయణ కమిటీ అమరావతి పేరు చెప్పింది. కేంద్ర కమిటీ ఇచ్చిన సలహాను తుంగలో తొక్కి చట్టాన్ని ఉల్లంఘించింది చంద్రబాబు ప్రభుత్వమే. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చోవాలి.. ఎక్కడ నుంచి పరిపాలన సాగించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే. ఇందులో అపోహలు, ప్రశ్నలు వస్తే.. న్యాయస్థానాల్లో ప్రభుత్వం వివరణ ఇచ్చి దాని ప్రకారం వెళ్తుంది. 

నిన్నటిదానిపై మౌనంగా ఉన్న చంద్రబాబు.. ఈరోజు మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసుపై ట్వీట్‌ చేశారు. వివేకా హత్య కేసు బదిలీ జడ్జిమెంట్‌ ఆర్డర్‌ ఈరోజు ఇచ్చారు. తెలంగాణకు బదిలీ చేస్తున్నామని ఈరోజు ఆర్డర్‌ ఇచ్చారు. దాంట్లో కొత్తేమీ లేదు. మార్చాలనుకుంటున్నామని ముందే చెప్పారు. హత్యకు గురైన వైయస్‌ వివేకానందరెడ్డి వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు. 2019 ఎన్నికల్లో వైయస్‌ అవినాష్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తూ ముందురోజు రాత్రి కూడా అక్కడ తిరిగారు. మా నాయకుడు, స్వయాన మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు చిన్నాన్న, ఆ ఫ్యామిలీలో సీనియర్‌ సభ్యుడు. ఆయన హత్యకు సంబంధించిన దాంట్లో న్యాయం జరగాలని ఆ కుటుంబం, మా పార్టీ కోరుకుంటుంది. దాంట్లో రాజకీయాలు జొప్పించి, వేరే కారణాలతో వేరే కోణాల్లోకి వెళ్లకూడదని కుటుంబ సభ్యులను కొందరిని తీసుకొని చేస్తున్న టీడీపీ కుట్ర చేస్తోంది. 

పొలిటికల్‌గా వైయస్‌ జగన్‌ను, వైయస్‌ఆర్‌ సీపీని ఎదుర్కోలేక వ్యక్తిగత విషయాలను రాజకీయం చేసి కుట్ర చేస్తున్నారు. తద్వారా నిందలు మోపాలను ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబులా సీబీఐని రానివ్వమని అనడం లేదు. రాజ్యాంగ ప్రకారం ఎవరి బాధ్యతలు, ఎవరి అధికారాలు వారికి ఉంటాయి. ఈ కేసులో రాజకీయాలన్నీ టీడీపీ నుంచి ప్లే చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 

కేసు బదిలీపై మేము అభ్యంతరం తెలపడం లేదు. గతంలో సీబీఐ విచారణకు కూడా అభ్యంతరం తెలపలేదు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నిజం ఏంటనేది మాకూ తెలియాలి. మా నాయకుడు వివేకానందరెడ్డి హత్యకు ఎవరు బాధ్యులో వారు దొరకాలి.. వారికి కఠినమైన శిక్షపడాలని సీఎం వైయస్‌ జగన్, పార్టీ మొత్తం కోరుకుంటుంది.  

సీబీఐ ఇచ్చిన రిపోర్టు చదివితే.. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు ఎంత దిట్ట అనేది తెలుస్తుంది. చంద్రబాబు, టీడీపీ, ఆ పార్టీని నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు కరోనా వైరస్‌ లాంటిది. సెకండ్‌ వేవ్‌ కరోనా లంగ్స్‌లోకి వెళ్లి ఎటాక్‌ చేసేది.. ఇవన్నీ కూడా అంటివే.. సిస్టమ్‌ను డ్యామేజ్‌ చేసి, మేనేజ్‌ చేసి.. వాటి నుంచి వచ్చేవాటిని ప్రజలకు సంబంధించిన విషయాల్లా చూపించి పొలిటికల్‌గా లబ్ధిపొందాలనేది ఈరోజు కాదు.. రామరావును దించినప్పటి నుంచి, నాదెండ్ల భాస్కర్‌ అడ్డం తిరిగినప్పుడు ప్రతీ చోటా సిస్టమ్‌ను మెయింటైన్‌ చేయడం, అక్కడి నుంచి ప్రజలకు భ్రమ కల్పించడం. ఇప్పుడు వివేకానందరెడ్డి మర్డర్‌ను కూడా ప్రజలకు సంబంధించిన రాజకీయ అంశంగా తీసుకొచ్చి, దీంట్లో ఘోరం జరిగిపోయిందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 
 

Back to Top