టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్‌ పాదయాత్ర

మాజీ మంత్రి కొడాలి నాని
 

విజయవాడ:  టీడీపీలో వారసత్వం కోసమే నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎన్టీఆర్‌ వారసుల నుంచి లాక్కొనేందుకు లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఏ అర్హతతో లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్‌ మొదట ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. శాసన సభ్యుడిగా ఓడిపోయిన వాడు పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉండి పాదయాత్ర చేయాలని సూచించారు. లోకేష్‌ పాదయాత్ర టీడీపీకే ఉపయోగం లేదన్నారు.
 

Back to Top