వైయ‌స్ఆర్ 75వ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాలి

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు:  మాజీ మంత్రి పేర్ని నాని

దివంగత మ‌హానేత వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితో ముందుకెళతాం

మా పార్టీ ఆలోచనలకు, ఆశయాలకు పునాది వైయ‌స్ఆరే

అభివృద్దిని అందరికీ పంచాలన్న వైయ‌స్‌ఆర్ కలలే మా లక్ష్యాలు

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఆలోచన మేరకే ఈ సేవా కార్యక్రమాలు

వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు 

తాడేప‌ల్లి:  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి 75 వ జయంతిని ఈ నెల 8న ఘనంగా నిర్వహించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని ఏమ‌న్నారంటే..
జులై 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారి 75 వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏ మహనీయుడు స్పూర్తితో మా పార్టీ ఆరంభించబడిందో అదే స్పూర్తిని కొనసాగిస్తూ మళ్ళీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా రక్తదానం లేదా స్కూల్‌లో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో చెట్లు నాటడం వంటి సేవాకార్యక్రమాలు ఎంచుకుని చేపట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నామన్నారు. వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ గారి ఆలోచన మేరకు ప్రతి వైయ‌స్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు అందరూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. 
డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి గారిని స్మరించుకుంటూ పునరుత్తేజంతో అడుగులు వేస్తారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరుతున్నామని పేర్ని నాని తెలిపారు.

Back to Top