ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) 2021 ఫలితాలు విడుదల

విజ‌య‌వాడ‌:  ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీరింగ్‌కు సంబంధించి విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడించారు. కాగా విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి, ఫార్మా ఫలితాలు ఈ నెల 14న ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

  రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో నిర్వహించేవారు. అయితే మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.

Back to Top