చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం వైయస్ జగన్ సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు రెడీ
01 Nov 2019 3:11 PM
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
వైయస్ఆర్ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం
చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ జీరో అయిందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు వైయస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. చంద్రబాబులాగా వైయస్ జగన్ ఎవరినీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతను చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు కేసులకు భయపడి టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపారని ఆయన విమర్శించారు. టీడీపీని కూడా బీజేపీలో కలిపేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ధైర్యం చాలడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా బీజేపీలో చేరాలని తపిస్తున్నారని చెప్పారు.