కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
ప్రపంచం ఉన్నంత వరకు ఫోటోగ్రఫి ఉంటుంది
01 Nov 2019 3:01 PM
ఫోటోగ్రాఫర్, జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలో మంత్రి కన్నబాబు
అమరావతి: ప్రపంచం ఉన్నంత వరకు ఫోటోగ్రఫి ఉంటుందని వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విజయవాడలోని కల్చరల్ ఆఫ్ సొసైటీలో ఫోటోగ్రాఫర్, జర్నలిస్టుల అవార్డ్స్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొని ఫోటో గ్రాఫర్లకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. తానూ ఒక జర్నలిస్ట్ గా పని చేసి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు. ఎక్కడి నుంచి వచ్చినా మన మూలాల్ని మర్చిపోకూడదని, రిపోర్టర్ కష్టం కన్నా ఫోటోగ్రాఫి చాలా కష్టమైన పని అని అన్నారు. మాజీ సీఎం ఎన్టీ రామారావు చనిపోయే సమయంలో తాను జర్నలిస్టుని, ఆ సమయం లో నా కళ్ళల్లో నీటిని ఫోటోలో బంధించారని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ అందరితో కలిసి పని చేసిన తాను.. ఇప్పుడు అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఫోటోల సాక్ష్యం తోనే ఎన్నో కేసులు తీర్పులు ఇవ్వడం జరిగిందనా పేర్కొన్నారు.