ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ప్రజల ప్రాణాలంటే అంత చులకనా..?
23 Jan 2021 1:01 PM
ఎస్ఈసీ నిమ్మగడ్డపై డిప్యూటీ సీఎం అంజాద్బాషా ఫైర్
కడప: నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, వ్యాక్సిన్ సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటీ..? ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా..? అని ఎస్ఈసీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ ఒక రాజకీయ నాయకుడి డైరెక్షన్లో పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పట్టడా..? అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమన్నారు. రాష్ట్ర ప్రజలందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు వద్దని కోరుతున్నామన్నారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ మాత్రం ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్ధమవుతున్నాడని మండిపడ్డారు.