రేపు సీఎం  వైయ‌స్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటన

సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(బుధ‌వారం) హైద‌రాబాద్‌కు వెళ్తున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుంటారు. అక్కడ సూపర్‌స్టార్‌ కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top