రామ్‌కో సిమెంట్ ప‌రిశ్ర‌మను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రూ.1,790 కోట్లతో నెల‌కొల్పిన‌ రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల తిరుమ‌ల ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకొని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల‌కు సీఎం చేరుకున్నారు. ఓర్వ‌క‌ల్లులోని ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి విమానాశ్ర‌యానికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. కొలిమిగుండ్ల‌కు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రామ్‌కో సిమెంట్ ఫ్యాక్ట‌రీని ప్రారంభించారు.

Back to Top