మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు 

వైద్య ఆరోగ్యశాఖ స‌మీక్ష‌లో సీఎం వైయస్‌.జగన్ 

వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ 

ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌

ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదన్న సీఎం

రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ 

మెరుగైన సేవలే లక్ష్యంగా ఆరోగ్య‌శ్రీ యాప్‌ ఉండాలన్న సీఎం

తాడేప‌ల్లి: మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు రాష్ట్రంలో అమ‌లు కానున్నాయి. మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.  అదే రోజు నుంచి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆస్పత్రుల సందర్శన ప్రారంభించాల‌న్నారు. అదేరోజు గోరుముద్దలో భాగంగా వారానికి మూడుసార్లు పిల్లలకు రాగిమాల్ట్‌ పంపిణీ ప్రారంభించాల‌న్నారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.  ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం సమీక్షించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించిన అధికారులు.  ప్రతి విలేజ్‌ క్లినిక్‌కు నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ వెళ్తారని తెలిపిన అధికారులు.  జనాభా 4వేలు దాటి ఉంటే మూడోసారి కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే......: 

  •  మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని సీఎం ఆదేశం. 
  •  మార్చి 1న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని సీఎం ఆదేశం. 
  •  ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతుందన్న సీఎం.
  •  దీనివల్ల ఆస్పత్రుల పనితీరుపై వారి వైపునుంచి కూడా పర్యవేక్షణ ఉంటుందన్న సీఎం.
  •  ఇంకా ఏమైనా లోపాలు, సమస్యలు ఉంటే వారి నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని వాటిని కూడా పరిష్కరించే చర్యలు చేపట్టాలన్న సీఎం.
  •  ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుందన్న సీఎం. 
  •  మార్చి 1 నుంచి కూడా గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా పిల్లలకు రాగి మాల్ట్‌ అందిస్తామన్న సీఎం. 
  •  ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలన్న సీఎం.
  •  డబ్ల్యూహెచ్‌ఓ లేదా జీఎంపీ ఆధీకృత మందులు మాత్రమే ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని, దీన్ని పటిష్టంగా  అమలు చేయాలన్న సీఎం. 
  •  ఎక్కడా మందులకు కొరత ఉందన్న మాటే వినిపించకూడదన్న సీఎం.
  •  ప్రజారోగ్య వ్యవస్థలో దేశానికి మన రాష్ట్రం ఒక ఆదర్శంగా నిలవాలన్న సీఎం.
  •  వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న సిబ్బందిని సంపూర్ణస్థాయిలో ఉపయోగించుకోవాలన్న సీఎం. 
  •  గ్రామ సచివాలయ స్థాయిలోనే ఎనీమియా లాంటి కేసులను గుర్తించి వారి ఆరోగ్యానికి తగిన చర్యలు తీసుకోవాలి.
  •  సీఎం ఆదేశాలమేరకు ఇప్పటికే ఎనిమీయా కేసులపై సర్వే చేయించామన్న అధికారులు.
  •  వీరిలో రక్తహీనతను నివారించడానికి వైద్య పరంగా, పౌష్టికాహారం పరంగా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.
  •  వైద్యారోగ్యశాఖ – స్త్రీ శిశుసంక్షేమ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని, డేటా అనుసంధానత ఉండాలన్న సీఎం.
  •  స్కూల్స్, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై తల్లులు, పిల్లల్లో రక్తహీనత లాంటి సమస్యలను పూర్తిగా నివారించాలన్న సీఎం.

 

 విలేజ్‌ క్లినిక్స్‌ - ఎస్‌ఓపీ    

  •  విలేజ్‌ క్లినిక్స్‌ ఎస్‌ఓపీలో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీరు, కాలుష్యం తదితర అంశాలను సీఎం ఆదేశాల మేరకు చేర్చామన్న అధికారులు.
  •  విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది నుంచి సంబంధిత సమస్యలను నివేదించగానే వెంటనే చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థలను సిద్ధం చేయాలన్న సీఎం.
  •  మండలస్థాయి అధికారులు, జేసీ, కలెక్టర్‌ వీటిపై పర్యవేక్షణ చేయాలన్న సీఎం.
  •  పరిసరాల పరిశుభ్రత, సమతుల్య ఆహారం, వ్యాయామం ఇతర ఆరోగ్య అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న సీఎం.
  •  108, 104 వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. 
  •  ప్రతిరోజూ దీనిపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశం.
  •  జిల్లాల్లోని కలెక్టర్లు కూడా దీనిపై పర్యవేక్షణ చేయాలన్న సీఎం.
  •  ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్స్‌ సిబ్బంది అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలన్న సీఎం. 
  •  సిబ్బంది ప్రతి కుటుంబాన్నీ కలుసుకుని విలేజ్‌ క్లినిక్స్‌ సేవలను వివరించాలన్న సీఎం.
  •  తాము అందుబాటులో ఉంటున్న తీరు, అందుతున్న సేవలపై ప్రతికుటుంబానికీ వారి ద్వారా వివరాలు అందాలన్న సీఎం.
  •  గ్రామ సచివాలయాల సిబ్బంది తరహాలోనే ఈ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం నిర్వహించాలన్న సీఎం. 
  •  హైరిస్క్‌గా గుర్తించిన వారిని, ప్రసవం కోసం ముందస్తుగానే మంచి ఆస్పత్రులకు తరలించాలన్న సీఎం.
  •  ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
  •  గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ, మధుమేహం లాంటి ఎన్సీడీ (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) నివారణ, చికిత్సలపై సీఎం సమీక్ష.
  •  రక్తపోటు, మధుమేహం లాంటి ఎన్సీడీ వ్యాధులతో బాధపడే వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న సీఎం. 
  •  వారు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటున్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలన్న సీఎం.
  •  క్రమం తప్పకుండా అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాం ద్వారా వీరిని కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష చేయాలన్న సీఎం. 
  •  కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టామన్న సీఎం.
  •  ఉద్దానంలో కిడ్నీ వ్యాధిని నివారించడానికి దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నామన్న సీఎం.
  •  పాలకొండకు కూడా మరో సుమారు రూ.265 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
  •  పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. 
  •  తాగునీటి పథకం, ఆస్పత్రి ఈ రెండు కూడా మార్చికల్లా  పూర్తవుతాయని అధికారులు నాకు చెప్పారన్న సీఎం.  
  •  ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వతంగా మన ప్రభుత్వం పరిష్కారాలు చూపుతోందన్న సీఎం. 
  •  పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ మరియు 200 పడకల ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశం. 
  •  ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించిన సీఎం. 
  •  రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధిని ముందస్తుగానే గుర్తించి వారికి తగిన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
  •  వైద్య సిబ్బందికి స్క్రీనింగ్, చికిత్సలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్న అధికారులు.
  •  ప్రతి బోధనాసుపత్రిలో కూడా క్యాన్సర్‌ నివారణా పరికరాలు, చికిత్సలు ఉండాలని సీఎం ఆదేశం. 
  •  కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల్లో కూడా ఈ పరికరాలు, చికిత్సలు ఉండాలన్న సీఎం.
  •  ప్రతి బోధనాసుపత్రిలోనూ గుండెజబ్బుల చికిత్సా కేంద్రాలు ఉండాలన్న సీఎం.
  •  అన్ని చోట్లే క్యాథ్‌ ల్యాబ్స్‌ పెట్టాలన్న సీఎం. 
  •  నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ కొత్త మెడికల్‌ కాలేజీల్లోనూ ఇవి ఏర్పాటు కావాలన్న సీఎం. 
  •  ఈ సౌకర్యాలను మెరుగు పరచుకోవడం ద్వారా క్యాన్సర్‌ మరియు గుండెజబ్బులకు సంబంధించి మరిన్ని పీజీ సీట్లు సాధించడానికి అవకాశం ఉంటుందన్న సీఎం. 
  •  తద్వారా రాష్ట్రంలోనే సరిపడా వైద్య నిపుణులు తయారవుతారన్న సీఎం.

దంత సంరక్షణపైనా అవగాహన..

  •  చిన్నారులు, స్కూలు పిల్లల్లో దంత శుభ్రతపై అవగాహన కల్పించాలన్న సీఎం.
  •  స్క్రీనింగ్‌ నిర్వహించి వారికి చికిత్స అందించే కార్యక్రమంపై తగిన ఆలోచన చేయాలన్న సీఎం. 
  •  గతంలో సీఎం ఇచ్చినా ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ సేవలపై యాప్‌ను రూపొందించిన అధికారులు.
  •  యాప్‌లో మరికొన్ని మార్పులు చేర్పులపై సీఎం సూచనలు.
  •  త్వరలోనే యాప్‌ ప్రారంభానికి సన్నాహాలు చేయాలన్న సీఎం. 
  •  రోగులకు మరింత నాణ్యతతో, మెరుగైన సేవలే లక్ష్యంగా యాప్‌ ఉండాలన్న సీఎం. 

 
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆర్యోశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌.ఎస్‌.రావత్,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌(డ్రగ్స్‌) రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హెచ్‌ ప్రసాద్, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సాంబశివారెడ్డి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ డాక్టర్‌ బి.చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top