విద్యారంగంలో ‘నాడు–నేడు’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: విద్యారంగంలో ‘నాడు – నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్లలో ఏర్పాటు చేసే ఫర్నిచర్‌ను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు. ఫర్నిచర్‌తో పాటు బ్లాక్‌బోర్డు, విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించేందుకు స్కూళ్లలో ఏర్పాటు చేయబోయే వాటర్‌ ప్లాంట్, రికార్డులు భద్రపరుచుకునే లాకర్లు, ఫ్యాన్లను సీఎం వైయస్‌ జగన్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. 
 

Back to Top