వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విద్యారంగంలో ‘నాడు–నేడు’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
03 Jun 2020 2:27 PM
తాడేపల్లి: విద్యారంగంలో ‘నాడు – నేడు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూళ్లలో ఏర్పాటు చేసే ఫర్నిచర్ను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. ఫర్నిచర్తో పాటు బ్లాక్బోర్డు, విద్యార్థులకు రక్షిత మంచినీరు అందించేందుకు స్కూళ్లలో ఏర్పాటు చేయబోయే వాటర్ ప్లాంట్, రికార్డులు భద్రపరుచుకునే లాకర్లు, ఫ్యాన్లను సీఎం వైయస్ జగన్ అధికారులతో కలిసి పరిశీలించారు.