జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలి

 అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు

అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలి 

సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండి 

  దేశంలోనే సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ  నిలుస్తుంది

 వైయ‌స్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష 

 తాడేప‌ల్లి: జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాల‌ని సూచించారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో గురువారం  వైయ‌స్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకంపై సీఎం  వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలి: 
సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో సహితం రికార్డులు అప్‌డేట్‌ కావాలి :
భూమి కార్డులను రైతులకు ఇవ్వాలి :
అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి:
సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవాలి:
డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయండి:  అధికారులకు సీఎం ఆదేశం
అవసరమైన సాప్ట్‌వేర్‌ను సమకూర్చుకోవాలి:
సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వండి :
దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకోవాలి:
ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్న సీఎం
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సీఎం

అనుకున్న సమయానికి కచ్చితంగా సమగ్ర భూసర్వే పూర్తి చేస్తామన్న అధికారులు
ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీని కచ్చితంగా దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామన్న అధికారులు
దేశంలోనే సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ  నిలుస్తుందన్న అధికారులు

సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలి: సీఎం ఆదేశం
సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి:
అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లోకూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తాను: సీఎం  
ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తాను: 
సమగ్ర సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: 
నిర్దేశించుకున్న గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కావాల్సిందే: 
అధికారులకు స్పష్టం చేసిన సీఎం వైయస్‌.జగన్‌ 
సర్వే ఆఫ్‌ ఇండియాతో కూడా సమన్వయం చేసుకోవాలి:
వారి సహకారాన్ని కూడా తీసుకొండి:
సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలి భూగర్భ గనులశాఖ అధికారులకు సీఎం ఆదేశం
సకాలంలో వాటిని అప్పగించాలన్న సీఎం 
నాలుగు ప్లాంట్లులో నవంబరు నుంచి సర్వేరాళ్లు ఉత్పత్తి ప్రారంభమవుతుందన్న అధికారులు
రోజుకు ఒక్కో ప్లాంట్లు నుంచి 4వేలు చొప్పున రోజుకు 16వేల సర్వేరాళ్లు ఉత్పత్తి చేస్తామంటున్న భూగర్భగనులశాఖ అధికారులు

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్,  పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్‌ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top