మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పోలవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్
14 Dec 2020 10:53 AM
పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పోలవరం చేరుకున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం కొద్దిసేపటి క్రితమే పోలవరం చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైయస్ఆర్ సీపీ నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులతో పాటు డ్యామ్ నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం వైయస్ జగన్.. గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.25 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వైయస్ జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది.