‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకం ఆవిష్క‌ర‌ణ‌

తాడేప‌ల్లి: మహాగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుపై సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించిన ‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయలతో పాటు, ఘంటసాల చిత్రమాలికలతో పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ల మల్లికార్జునరావు రూపొందించారు. ఈ  కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Back to Top