పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నేడు ‘జగనన్న ప్రాణవాయువు’ ప్రారంభం
10 Jan 2022 11:36 AM
124 ప్రభుత్వాసుపత్రిల్లో 144 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
కాసేపట్లో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్
తాడేపల్లి: భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాణవాయువుకు కొరతలేకుండా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమానికి వైయస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 50, అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్పీఎం సామర్థ్యం గల 144 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లతో సహా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు.
124 ఆసుపత్రుల్లో 144 ప్లాంట్లు
రాష్ట్రవ్యాప్తంగా 124 సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో 144 పీఎస్ఏ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.189.5 కోట్లు వెచ్చించింది. ఇవి నిమిషానికి 500, వెయ్యి లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 124 ఆస్పత్రుల్లో నిమిషానికి 93,600 లీటర్ల (లీటర్స్ పర్ మినిట్–ఎల్పీఎం) ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వనుంది. మరోవైపు.. పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కరోనా మూడో దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
ఆ వివరాలు..
– రూ.90.07 కోట్లతో 24,419 పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు.
– 35 ఆసుపత్రుల్లో రూ.15 కోట్లతో 399 కిలోలీటర్ల సామర్థ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ట్యాంకర్ల ఏర్పాటు.
– మరో 39 ఆస్పత్రుల్లో రూ.16.3 కోట్లతో 390 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్ఎంఓ ట్యాంకర్లను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం.
– ఆక్సిజన్ సరఫరా, నిల్వ చేయడానికి 20 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన 25 కంటైనర్లు రూ.15.25కోట్లతో కొనుగోలు.
– 23,971 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 26,746 డీ టైప్ సిలిండర్ల కొనుగోలు.
– రూ.6.22 కోట్లతో 13 జిల్లాల్లో 20 వీఆర్డీఎల్ ల్యాబ్ల ఏర్పాటు.
– రూ.21.93 కోట్లతో సివిల్, ఎలక్ట్రికల్ పనులు నిర్వహణ.
– రూ.297.36 కోట్లతో మెడికల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, కోవిడ్ కిట్స్ కొనుగోలు.