కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
నవంబర్ 2వ తేదీ నుంచి స్కూళ్లు
20 Oct 2020 5:39 PM
రెండు రోజులకోసారి తరగతులు, మధ్యాహ్నం వరకే పాఠశాలలు
తాడేపల్లి: నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండురోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులు మరో రోజు నిర్వహిస్తారు. ఒకవేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడురోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయి. మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు. నవంబర్ నెలలో ఇది అమలవుతుంది. డిసెంబర్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారి కోసం ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తారు’’ అని సీఎం వైయస్ జగన్ తెలిపారు.