ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం వైయస్‌ జగన్‌కు ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చిస్తారు. అదే విధంగా సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. రేపు ఉదయం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. 
 

Back to Top