సీఎస్ఐ చ‌ర్చిలో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుకలు

ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, కుటుంబ స‌భ్యులు

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందుల భాక‌రాపురం సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో నిర్వ‌హించిన ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం త‌ల్లి వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌మ్మ‌, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయస్‌ జగన్ రాష్ట్ర‌ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం సీఎస్ఐ చ‌ర్చి నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. చ‌ర్చిలో ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారంతా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపి.. సీఎంతో ఫొటోలు దిగారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Back to Top