క్లీన్ విశాఖే లక్ష్యం

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

విశాఖ‌:  విశాఖ న‌గ‌రాన్ని క్లీన్ సిటీగా మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్కరు కృషి చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి విశాఖ జిల్లాల రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2022లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ 4వ అవార్డుగెల్చుకున్న సందర్భంగా గురువారం వీఎంఆర్‌డీఏ చైల్డ్రన్ థియేటర్ లో జరిగిన స్వచ్ విశాఖ పురస్కార్ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. కార్య‌క్ర‌మంలో నగర మేయర్  హరివెంకట కుమారి ,జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు , పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Back to Top