ఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటన
ఈ నెల 11 నుంచి ‘గడప గడపకూ’
08 May 2022 11:13 AM
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
అనంతపురం: ‘‘మూడేళ్లలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మేము చేసిన అభివృద్ధిని జనం కళ్లారా చూశారు. అందుకే మా వెంటే నడుస్తున్నారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రభంజనం ఖాయం. జిల్లాలోని అన్ని స్థానాల్లో వైయస్సార్ సీపీ జెండా ఎగురవేస్తాం’’ అని వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 11 నుంచి ‘గడప గడపకూ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి ఎమ్మెల్యే గడప గడపకూ వెళ్లి జగనన్న ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. అలాగే ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలియజేస్తామన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలకు ఎవరైనా దూరమైతే... అక్కడికక్కడే సమస్య పరిష్కరిస్తారన్నారు. కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి మాట్లాడుతూ... కదిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, 30 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ మూడేళ్లలో చేసి చూపించామన్నారు. సమావేశంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైయస్సార్ సీపీ మండల కన్వీనర్లు పాల్గొన్నారు.