ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు
23 Oct 2019 5:04 PM
పోషకాహారంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
పిల్లలు ఏం తింటున్నారో పరిశీలించండి
గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062 విలువైన ఆహారం
రూ.500 విలువ చేసే వైయస్ఆర్ బాల సంజీవని కిట్
అమరావతి: ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పిల్లలు ఏం తింటున్నారో పరిశీలించాలని, ఎలాటి మార్పులు చేయాలో సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. పోషకాహారంలో నిపుణులైన వారి సలహాలు తీసుకోవాలన్నారు. బుధవారం పోషకాహారంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, నివారణపై ప్రత్యక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి దశలో రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్ ప్లాన్ ప్రాంతాల్లోని గర్భవతులు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారాన్ని పెంచుతూ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని తెలిపారు. గర్భవతులు, బాలింతలకు నెలకు రూ.1062 విలువైన ఆహారం, 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు 200 మిల్లీలీటర్ల పాలు, రూ.500 విలువ చేసే వైయస్ఆర్ బాల సంజీవని కిట్, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు నెలలో ప్రతి రోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, వైయస్ఆర్ బాలామృతం కిట్, మొత్తంగా రూ.600 విలువైన పౌష్టికాహారం ప్రభుత్వం అందించనుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజులు పౌష్టికాహారం, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతి రోజు భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారం, నెలకు రూ.560తో పౌష్టికాహారం ప్రభుత్వం అందించనుంది.