నిరాశ, నిస్పృహలకు లోనుకావొద్దు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

 

వైయస్‌ఆర్‌ జిల్లా: రైతులు ఎవరూ నిరాశ, నిస్పృహకు లోనుకావొద్దు.. రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలానికి చెందిన రైతు శంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల శ్రీకాంత్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రైతు శంకర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

Read Also:  మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించండి

తాజా వీడియోలు

Back to Top