కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించండి
23 Oct 2019 3:17 PM
కాలుష్య నివారణ, సుందరీకరణ, చెట్ల పెంపకంపై సమీక్ష
అమరావతి: ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలో గుర్తించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కాలుష్య నివారణ, సుందరీకరణ, చెట్ల పెంపకంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణ కార్యక్రమాల్లో విస్తృతంగా పని చేసిన జీడబ్ల్యూఎస్ ప్రతినిధులను అధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిచయం చేశారు. కేరళలో చేపట్టిన కార్యక్రమాలను జీడబ్ల్యూఎస్ ప్రతినిధులు వివరించారు. కాల్వల శుద్ధి, అభివృద్ధి కార్యక్రమాల్లో జీడబ్ల్యూఎస్ సహాయం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడలో 4 కిలోమీటర్ల పొడవునా కాల్వను పైలెట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మురుగునీటిని శుద్ధిచేసిన తరువాతనే కాల్వలోకి విడిచిపెట్టాలని సూచించారు. గోదావరి, కృష్ణా కాల్వల్లో బాగు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు. గోదావరి, కృష్ణా కెనాల్స్ మిషన్ను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని చెప్పారు.