ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు
08 Dec 2022 5:28 PM
రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
న్యూఢిల్లీ: నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ద్వారా పలు పథకాలు అందిస్తోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. ఈ అంశంపై గురువారం రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సాంకేతిక అభివృద్ధి, అవగాహన, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలు కల్పన వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీని నిషేధిస్తూ 2021 ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 2022 జూలై 1 నుంచి ఆ ఆదేశాలను అమలు చేసినట్లు తెలిపారు. అయితే ప్రత్యామ్నాయ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు తయారీదార్లకు కొంత సమయం ఇచ్చాం. ఈ యూనిట్లు ఏర్పాటు ద్వారా కొత్త వ్యాపార మార్గాలు, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యమ్నాయ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న నిషేధిత ప్లాస్టిక్ తయారీ యూనిట్లుకు జీఎస్టీ రేట్లు సర్దుబాటు చేయాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ సూచించినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
ఖేలో ఇండియాతో క్రీడల అభివృద్ధి
ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో క్రీడలు, వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖేలో ఇండియా క్రీడా పోటీలు నిర్వహించడం క్రీడల అభివృద్ధిలో మైలురాయి అన్నారు. క్రీడా పోటీలు ద్వారా క్రీడల సంస్కృతి బలపడటంతో పాటు ఆయా రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. క్రీడలు, వాటి అభివృద్ధి, వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కేంద్రం క్రీడలకు సంబంధించి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు.