ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
బాబు విధానాలు నచ్చక టీడీపీని వదిలిపెట్టాం
18 Feb 2019 2:15 PM
అవంతి శ్రీనివాస్
హైదరాబాద్: చంద్రబాబు విధానాలు నచ్చక టీడీపీని వదిలిపెట్టామని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీడీపీని రాజీనామా చేసిన ఆయన ఇటీవల వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఇవాళ అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రబాబుతో కలిసి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ఆత్మగౌరవం చంపుకొని టీడీపీలో పనిచేశామన్నారు. మా జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. టీడీపీలో మా రోదన అరణ్య రోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వదిలిపెట్టి వైయస్ఆర్సీపీలో చేరామని పేర్కొన్నారు.