బాబు విధానాలు నచ్చక టీడీపీని వదిలిపెట్టాం

అవంతి శ్రీనివాస్‌
 

హైదరాబాద్‌: చంద్రబాబు విధానాలు నచ్చక టీడీపీని వదిలిపెట్టామని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టీడీపీని రాజీనామా చేసిన ఆయన ఇటీవల వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇవాళ అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రబాబుతో కలిసి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

ఆత్మగౌరవం చంపుకొని టీడీపీలో పనిచేశామన్నారు. మా జోలికి రావొద్దని ఆయన హెచ్చరించారు. టీడీపీలో మా రోదన అరణ్య రోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం వదిలిపెట్టి వైయస్‌ఆర్‌సీపీలో చేరామని పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top