ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
జగన్నామ సంక్షేమ సంవత్సరంగా 2022
23 Dec 2022 6:23 PM
అగ్రి మిషన్ వైస్ చైర్మన్, వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి
కరువులోనే చంద్రబాబు రికార్డు
బాబు పాలనలో అంతా కరువు. జగన్ గారి పాలనలో పండుగలా వ్యవసాయం
మూడున్నరేళ్ళలోనే వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగా రూ. 85,295.98 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం ఇది
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళ కోసం రూ. 51,662 కోట్లు ఖర్ఛు
బాబువి కోతలు.. సీఎం వైయస్ జగన్ గారివి చేతలు
తాడేపల్లి: 2022వ సంవత్సరం జగన్నామ సంక్షేమ సంవత్సరమని అగ్రి మిషన్ వైస్ చైర్మన్, వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాభదాయకంగా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను మించిన సంక్షేమం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రైతులకు అండగా నిలిచారు. మూడున్నరేళ్ల కాలంలో రైతులకు ఎంతో మేలు జరిగింది. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలిచారు.
చంద్రబాబు హయాంలోనే ఖరీఫ్లో ఉత్పత్తి అతి తక్కువగా జరిగింది. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అత్యధికంగా ఖరీఫ్లో ఉత్పత్తులు సాధించారు. లాభదాయక పంటలు పండించే విధంగా ప్రభుత్వం పని చేస్తోంది. హార్టికల్చర్ సాగు కూడా పెరిగింది. ఆక్వా కల్చర్, వ్యవసాయం, హార్టికల్చర్ ఈ మూడు రంగాలు కలిపి సాగు అంచనాలు వేస్తారు. 40 శాతం హార్టికల్చర్ ఉత్పత్తులు పెరిగాయి. దేశంలోనే రాష్ట్రంలో పండ్లు, కూరగాయాల సాగులో అగ్రగామీగా నిలిచిందని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు.