వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా  విడుద‌ల‌

తాడేప‌ల్లి: అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ మూడో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేసింది. మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. 

పార్ల‌మెంట్ అభ్య‌ర్థులు ..

  • విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, 
  • విజయవాడ ఎంపీగా కేశినేని నాని, 
  • కర్నూల్‌ ఎంపీగా గుమ్మనూరి జయరాం,
  • తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం, 
  • టెక్కలి ఎంపీగా పేరాడ తిల‌క్‌
  • ఏలూరు ఎంపీ అభ్య‌ర్థిగా కారుమూరి సునీల్ కుమార్ 
  •  

‘‘

Back to Top