వైయస్ఆర్ కాంగ్రెస్ సమైక్య పోరు షెడ్యూల్

హైదరాబాద్, 1 అక్టోబర్ 2013:‌

సమైక్య రాష్ట్రం కోసం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సీమాంధ్రలోని 175 నియోజక వర్గాల్లో‌ బుధవారం నుంచి ఒకేసారిగా నిరాహార దీక్షలు చేయనున్నది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో గాంధీ జయంతి నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇందు కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ‌బుధవారం నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనస‌భా పక్షం ఉప నాయకురాలు, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకూ వైయస్ఆర్ ‌కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని శోభా నాగిరెడ్డి తెలిపారు.

సమైక్య పోరు ‌షెడ్యూల్ ఇదీ:
అక్టోబర్‌ 2 నుంచి శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతరులు నిరాహార దీక్షలు.
అక్టోబర్‌ 7న పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా మంత్రులు, కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ళ ముందు ధర్నాలు. ప్రజా ప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలియజేయడం.
అక్టోబర్‌ 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు.
అక్టోబర్‌ 17న శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ.
అక్టోబర్‌ 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు- మానవహారాలు.
అక్టోబర్‌ 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్‌ ర్యాలీలు.
అక్టోబర్‌ 26న జిల్లాల్లోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీచేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష‌.
అక్టోబర్‌ 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలు.
నవంబర్‌ 1న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ- సమైక్యాంధ్రను కోరుతూ తీర్మానాలు.
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి భారీ ఎత్తున ద్దతు లభిస్తోంది.

Back to Top