చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
శాంతియుత సహ జీవనమే క్రిస్మస్ సందేశం
24 Dec 2013 5:29 PM
హైదరాబాద్, 24 డిసెంబర్ 2013:
సర్వ మానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, సహనం, శాంతి, ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆయన రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ మంగళవారం ఒక ప్రకటనలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హింస, ద్వేషం, అసహిష్ణుత వంటి వాటికి పౌర జీవనంలో చోటు లేదని అన్నారు.
సర్వత్రా అశాంతి నిండిన ఈ తరుణంలో క్రీస్తు ప్రవచనాలు మనకు దారి చూపుతాయని, శాంతియుత సహజీవనమే క్రిస్మస్ మనకు ఇచ్చే దివ్య సందేశం అని శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలంతా సంయమనంతో కలిసి మెలిసి ఉండాలన్న క్రీస్తు బోధనలు ఆచరణలోకి వచ్చినప్పుడు సామాజిక సంక్షోభాలు సమసిపోతాయని శ్రీ వైయస్ జగన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.