కృష్ణదాసు మాతృమూర్తి మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 4 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు మాతృమూర్తి సావిత్రమ్మ (79) మరణం పట్ల పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సావిత్రమ్మ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సావిత్రమ్మ మరణించిన వార్త తెలిసిన వెంటనే విజయమ్మ కృష్ణదాసుకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ధర్మాన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సావిత్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని విజయమ్మ ఆకాంక్షించారు.

Back to Top