<br/>విశాఖ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైయస్ఆర్సీపీ నేత గొల్ల బాబురావు మండిపడ్డారు. గురువారం ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.