కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకుంది. ఇవాళ ఉదయం 8.30 గంటలకు సౌదరదిన్నె నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టి ఆమదాల క్రాస్ రోడ్డు, గులాంనబీ పేట-బొందల దిన్నెక్రాస్ రోడ్డు, ఎల్లురి కొత్తపేట మీదుగా బనగానపల్లికు చేరుకున్నారు. రాజన్న బిడ్డకు పట్టణంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగిస్తారు.