ఎచ్చెర్ల నుంచి 315వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
  

 శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత 315వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఎస్‌.ఎం పురం, కేశవరావు పేట, లక్ష్ముడి పేట, నవభారత్‌నగర్‌ మీదుగా ఫరీదుపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3,400.7 కిలోమీటర్లు నడిచారు. 

Back to Top