నేడు రాజాంలో భారీ బహిరంగ సభ


  శ్రీకాకుళం: నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. జననేత సోమవారం ఉదయం రేగిడి మండలంలోని బురాడ నుంచి పాదయాత్రను ప్రారంభించారు.  అక్కడి నుంచి కొర్లవలస క్రాస్‌ మీదుగా గురవాం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర రాజాం మీదుగా అంతకాపల్లి వరకు కొనసాగనుంది. ఇవాళ రాజాంలో జరిగే భారీ బహిరంగ సభలో జననేత ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్రకు శ్రీ‌కాకుళం జిల్లాలో అపూర్వ స్పంద‌న ల‌భిస్తోంది. గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్న ప్ర‌జ‌లు త‌మ బాధ‌లు జ‌న‌నేత‌కు చెప్పుకుంటూ స్వాంత‌న పొందుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తుండ‌టంతో రాజాం ప‌ట్ట‌ణం వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు, ప్లేక్సీల‌తో నిండిపోయింది. ఏ చెట్టుకు చూసినా పార్టీ జెండాలే క‌నిపిస్తున్నాయి. వైయ‌స్ జగన్‌ ఇప్పటివరకు 3,360.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకున్నారు.



Back to Top