జోగన్నపాలెం నుంచి 254వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 విశాఖపట్నం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. మంగళవారం ఉదయం జననేత 254వ రోజు పాదయాత్రను జోగన్నపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, బొట్టవానిపాలెం, కె. సంతపాలెం, చంద్రయ్యపేట, అయ్యన్న పాలెం మీదుగా బుద్దిరెడ్డి పాలెం క్రాస్‌ వరకు వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది.  
 

 
Back to Top