<br/>గుంటూరు:వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 120వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఉదయం వైయస్ జగన్ గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం, ములకలూరు వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభమవుతోంది. అక్కడి నుంచి గొల్లపాడు, ముప్పళ్ల వరకు పాదయాత్ర సాగుతుంది.