<br/>చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లాకు చెందిన గోపాలమిత్ర ఉద్యోగులు కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని కుప్పం బాదురు వద్ద జననేతకు కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. కనీస వేతనాలు ఇవ్వడం లేదని, అది కూడా నాలుగు నెలలకొసారి ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.