2019లో వైయస్‌ జగనే సీఎం

 2019లో వైయస్‌ జగనే సీఎం
వై. వెంకట్రామిరెడ్డి, గుంతకల్‌ నియోజకవర్గ సమన్వయకర్త 

అనంతపురం:  నాలుగేళ్ల  పాలనలో  చంద్రబాబు  ప్రజలను  ఏవిధంగా  వచించారో అందరికి తెలుసనీ, మనందరినీ 
మోసం చేస్తున్న పాలనకు ఘోరి కడుదామంటూ పిలుపునిచ్చారు.  ప్రజా సంకల్పయాత్రోలో భాగంగా గుత్తిలో టౌన్ లో సోమవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహాసంకల్పంతో ప్రజా సంకల్ప యాత్రతో మన ఊరికి వచ్చిన వైయస్‌జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, నవరత్నాలాంటి పథకాలను మనకు ఇవ్వనున్నారనీ, 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వనున్నారు. నెలకు రూ.2 వేలు పింఛన్‌ ఇవ్వనున్నారని వివరించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే ఒక అడుగు ముందుకు వేసి వైయస్‌ జగన్‌ బ్రహ్మండమైన సంక్షేమ పథకాలు ప్రకటించారన్నారు. వైయస్‌జగన్‌ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 2019లో దేవుని దయవల్ల ,ప్రజల ఆశీస్సులతో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కాగానే  జిల్లాలోని సమస్యలను పరిష్కరించాలని వైయస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా గుంతకల్‌నియోజకవర్గం నుంచి వెళ్తున్నా కూడా చెరువులకు నీరివ్వడం లేదన్నారు. గుంతకల్, గుత్తి, పామిడి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరివ్వాలని వైయస్‌ జగన్‌ను కోరారు. నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయని, వాటన్నింటిని తిరిగి ప్రారంభించాలని కోరారు. ఇండస్ట్రీయల్‌ హబ్‌గా గుంతకల్‌ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్నారు. మున్సిపాలిటీగా మార్చి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని తెలిపారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తమ సమస్యలకు పరిష్కారం ఒక్క వైయస్‌ జగనే అని ప్రజలంతా నమ్ముతున్నారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top